Wednesday, February 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బావిలోకి దూకిన త‌మ్ముడు..కాపాడబోయిన అన్న.. ఇద్దరు మృతి

బావిలోకి దూకిన త‌మ్ముడు..కాపాడబోయిన అన్న.. ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండ‌లంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమ్రి కోలాంగూడ గ్రామనికి చెందిన ఆత్రం సోనేరావ్‌కి ఆత్రం జంగు (29), ఆత్రం లేతు (27) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లేతుకి గత 8నెలల నుండి మతిస్థిమితం సరిగా లేదు. వీరు మంగళవారం శ్యాంపూర్ బుడుందేవ్ జాతరకు వెళ్లారు. అక్కడే ఇద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులో లేతు గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకాడు. తమ్ముడిని కాపాడాలని అన్న జంగు సైతం బావిలోకి దూకాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ బావిలో చనిపోయి కనిపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -