- Advertisement -
– మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
నవతెలంగాణ -మిరుదొడ్డి
లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం గ్రామ చౌరస్తాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగుపల్లి గ్రామానికి చెందిన కిచ్చని గంగయ్య రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన GJ 36 V 4797 నంబర్ గల లారీ ఢీకోట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 సహాయంతో సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



