కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
పలు చోట్ల మంత్రులు, ప్రతిపక్ష నేతలు, తెల్దారుపల్లిలో తమ్మినేని
నవతెలంగాణ-విలేకరులు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు విని యోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కోడంగల్లో తన ఓటు హక్కును కోడంగల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 6వ వార్డు, పోలింగ్ స్టేషన్ 12లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంకా మంత్రులు వివేక్, వాకిటి శ్రీహరి, అడ్డూరి లక్ష్మణ్కుమార్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మహేశ్ కుమార్ గౌడ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గంగుల కమలాకర్, వినోద్ కుమార్, సీనియర్ నేతలు జానారెడ్డి, జీవన్రెడ్డి, షబ్బీర్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్పీలు, అధికారులు, తదితరులు వినియోగించుకున్నారు. ఏదులాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లిలో సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసిన ప్రముఖులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



