నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్లో మరో సంచలనం నమోదైంది. శ్రీలంకలోని ప్రేమ్ దాస్ స్టేడియం వేదికగా జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో.. జింబాబ్వే బౌలర్ల హవా నడుస్తోంది. నాలుగు ఓవర్లోనే ఆసిస్ టాపార్డర్ను జింబాబ్వే బౌలర్లు ఔట్ చేశారు. అందులో ఇద్దరు బ్యాటర్లను డకౌట్ గా పెవిలియన్ పంపారు. గ్రీన్, డేవిడ్ డకౌట్ కాగా, ఇంగ్లీస్ (8), టీమ్ హెడ్ (17) స్వల్ప పరుగులకే ఔట్ కావడంతో.. 29-4తో ఆస్ట్రేలియా పీకల్లోత్తు కష్టాల్లో పడిపోయింది. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్: 105-4. క్రీజులో మాక్స్ వేల్ (31), రెన్షా (45) ఉన్నారు. ముజారాబాణీ, ఈవేన్స్ చెరో రెండు వికెట్లతో కదంతొక్కారు.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే..20 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బెన్నెట్(64) అర్థ సెంచరీతో చెలరేగగా, మారుమాణి(35) , ఆర్పీ బూరీ(35), సికందర్ రాజా(25) సముచిత ఇన్నింగ్స్ ఆడారు.



