- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్పై భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ 5 వికెట్లు తీసి మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు (166) తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించింది. థాయ్లాండ్ స్పిన్నర్ థిపాచా పుత్తావోంగ్ (165) రికార్డును అధిగమించింది. అంతర్జాతీయ క్రికెట్లో 350కి పైగా వికెట్లు తీసిన రెండో భారత మహిళా క్రికెటర్గా కూడా దీప్తి నిలిచింది.
- Advertisement -



