Monday, February 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధర్మభిక్షం ఆదర్శప్రాయుడు

ధర్మభిక్షం ఆదర్శప్రాయుడు

- Advertisement -

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బొమ్మగాని ధర్మభిక్షం 104వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పల్లాతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దామోదర్‌ రెడ్డి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గీత పనివారల సంఘం సమన్వయ కార్య దర్శి నాగభూషణం, ఉపాధ్యక్షులు కేవీఎల్‌, ప్రధాన కార్య దర్శి సాయిలు గౌడ్‌, ఆర్టీసీ మాజీ ఈడీ దోర్నాల వేణు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ వలివుల్లా ఖాద్రి, పోలగాని రవి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ..ధర్మభిక్షం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారనీ, గీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల కోసం రాష్ట్ర జాతీయ స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసి, వారి హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. ఈటీ నర్సింహ మాట్లాడుతూ..తాను న్యాయవిద్య అభ్యసించే సమయంలో ఆయన మాటల స్ఫూర్తితోనే సీపీఐలో చేరానని తెలిపారు. ధర్మభిక్షం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -