- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న కొలంబోలో జరిగిన మ్యాచ్లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసి సూపర్-8కు చేరింది. పాక్ వికెట్లు వరుసగా పడుతుండటంతో, ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మ్యాచ్ ముగియకముందే స్టేడియం వదిలి వెళ్లడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమ జట్టు పరాజయాన్ని చూడలేకే ఆయన మధ్యలోనే వెళ్లిపోయారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
- Advertisement -



