- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
వివిధ ఘటనతో మండల పరిధిలోని ప్రజలు కొంతకాలం క్రితం వారి మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నారు. వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళవారం పోయిన మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో లెక్కల నిఖిల్ రెడ్డి, గంగారెడ్డి, జగదీశ్ బాధితులను స్టేషన్ కు పిలిపించి, ఎవరి ఫోన్లను వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



