మండలంలోని నెమిలకాల్వకు చెందిన సీనియర్ టీడీపి నాయకులు దివంగత వంగాల బాల్ నర్సయ్య 13 వ వర్దoతి సందర్భముగా గ్రామ స్టేజి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భముగా పలువురు మాట్లాడుతూ టిడిపి పార్టీకి, ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వంగాల ఈశ్వరయ్య, వంగాల వాసుదేవ్ , వంగాల వెంకన్న,పైళ్ల రాజవర్ధన్ రెడ్డి,గూడూరు శివశాoత్ రెడ్డి,పబ్బు ఉపేందర్ బోస్,కాసుల కృష్ణ, మద్దెల మంజుల, వంగాల రోహిత్, బిక్షపతి, మల్లేశం, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.