- Advertisement -
కన్నీరున్నీరైన బాధిత కుటుంబం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆదివారం సాయంత్రం మండలంలో గాలీవానా భీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో నాచారం గ్రామానికి చెందిన చింతల సంపత్ అనే నిరుపేద కూలికి చెందిన ఇంటి పైకప్పు ధ్వంసమై, ఇంటిపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర విలువైన సామాగ్రి తడిసి ముద్దయి తీవ్రమైన నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబం కన్నీరున్నీరైయ్యారు. అధికారులు పరిశీలించి, ప్రభుత్వం ఆర్థికంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకొన్నారు.
- Advertisement -



