- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్న విద్యుత్ అధికారులపై TGSPDCL సీఎండీ ముషారఫ్ చర్యలు తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, కొత్త కనెక్షన్లు, రెగ్యులర్ సర్వీసులకూ డబ్బు వసూలు చేసిన 8 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో ఒక ADE, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 150కి పైగా ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపారు. ఆ 8 మంది ఫోన్ పే, GPay ద్వారా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు.
- Advertisement -



