- Advertisement -
సర్పంచ్ మేకల రాధా సుదర్శన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
సమ్మయ్య కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని చల్వాయి సర్పంచ్ మేకల రాధా సుదర్శన్ అన్నారు. శుక్రవారం మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన అనిరెడ్డి సమ్మయ్య తల్లి మణెమ్మ దశ దిన ఖర్మకూ సర్పంచ్ హాజరై సమ్మయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి మన్నెమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సధాకర్, చల్వాయి గ్రామ కార్యదర్శి రాజశేఖర్, సోమలగడ్డ కార్యదర్శి శ్రీధర్, కార్యదర్శి చుంచు భారతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



