ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర ప్రాతల్లో నటిస్తున్నారు. ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సమంత, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాను మే15న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. యాక్షన్ డ్రామా మూవీ అందరికీ నచ్చేలా, అన్ని అంశాలతో రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠతను రేపే యాక్షన్ ఎలిమెంట్స్ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.
చిత్ర యూనిట్ లేటెస్ట్గా సమంత ఉన్న కొత్త పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇది సినిమాకి ప్రత్యేకమైన విజువల్ లుక్ను తీసుకొచ్చింది. ఇది యాక్షన్ సీక్వెన్స్ల కోసం సమంత శారీరకంగా సిద్ధమైన తీరుని హైలైట్ చేస్తోంది. రీసెంట్గా రిలీజైన టీజర్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసారి సమంత ఎలా మెప్పించనుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్, స్టోరీ, స్క్రీన్ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మారింగంటి, సీతా మీనన్, యాక్షన్: లీ విట్టాకెర్, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదుర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల.
‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



