నవతెలంగాణ – కుభీర్
పేదింటి అడపడుచులకు కొండంతగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకమని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన కుభీర్ లోని రైతు వేదికలో 162మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్క ల పంపిణి చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ముధోల్ నియోజక వర్గంంలోనే అత్యధికంగా కుభీర్, తనూర్ మండలాల్లో కల్యాణ లక్ష్మి చెక్క్ లను పంపిణి చేయడం జరిగిందన్నారు. కుభీర్ లో 162మందికి కోటి 62 లక్షలకు పైగా చెక్క్ లను లబ్దిదారులకు పంపిణి చేశారు.
అదే విదంగా మండలంలోని కుభీర్, ఫార్డి కే నుంచి సెరపెల్లి వరకు రోడ్లు కు నిధులు మంజూరు కావడం జరిగింది వాటి పనులకు త్వరలోనే టెందార్లను పిల్పించెందుకు కృషి చేస్తామని అన్నారు. కుభీర్ లోని వివేకానంద విగ్రగాం నుంచి వెటర్నరీ అస్పత్రి వరకు రోడ్డు పూర్తిగా చెడి పోవడంతో వాహన దారులు ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవడం జరుగుతుందని కుభీర్ సర్పంచ్ సాయినాథ్ ఎమ్మెల్యే కు తెలపడం జరిగింది. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం లో ఐ టి డి ఏ లో రూ.70 లక్షలతో నిధులు మంజూరు చేసిన ఇప్పటి వరకు టెండర్లు ముందుకు రాకపోవడంతో మళ్ళీ కొత్త ప్రపోసల్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు.
గ్రామమలో వ్యవసాయ పనులకు వెళ్లే రోడ్లు కు ఉపాది హామీ కింద నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరాజ్ మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్ బైంసా ఆత్మ కమిటీ చేర్మెన్ వివేకానంద, ఆయా గ్రామాల సర్పంచులు మాజీఎంపీటీసీలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.



