Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళితుల స్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

దళితుల స్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 

జిల్లా కేంద్రంలోని 26 వ వార్డు బహార్ పేటలో దళితుల స్మశాన వాటిక ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ కోరారు. సోమవారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి  వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. భువనగిరి జిల్లా కేంద్రంలో 26 వార్డు బహార్ పేట సర్వేనెంబర్ 804 లో దళితుల కు సంబంధించిన స్మశాన స్థలంలో కొందరు ఆక్రమించుకొని దళితుల స్మశాన వాటికలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

గతంలో సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా 2014లో దళితుల స్మశాన వాటికను అట్టి భూమిని కొలతలు వేయించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో, ఆర్డీవోలు సర్వే చేసి ఈ భూమి ప్రభుత్వ దళితుల స్మశాన వాటికని బౌండరీలు చేయడం జరిగిందనారు. ఆ స్థలంలో ఎలాంటి మరమ్మతులు చేయవద్దని స్మశాన వాటిక స్థలమని బోర్డు ప్రభుత్వమే పెట్టిన బోర్డులను తొలగించి హౌసింగ్ బోర్డ్ ఆనుకొని ఉన్న కొంత భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి కమిషనర్ ని పిలిచి వాటిని తొలగించేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆక్రమించుకున్న వారిపై అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని  పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, బర్ల వెంకటేష్, వోల్దాస్ అంజయ్య, వల్దాస్ వెంకటేష్, చింతల శివ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -