- Advertisement -
నవతెలంగాణ – కుభీర్ : గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి 100రోజులు పని కల్పించేలా కృషి చేయాలని ఉపాది హామీ అధికారులకు స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ అన్నారు. గురువారం మండలంలోని పార్డి (బి ) గ్రామంలో ఉపాది హామీ పనులను ప్రారంభించి మాట్లాడారా. గ్రామమలో ఉన్న ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు కల్గిన వారికి పనులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విదంగా కూలీలకు పనికి తగ్గట్టుగా కూలి డబ్బులు అందించేలా చూడలన్నారు. దింతో పాటు వ్యవసాయ రైతులకు భూములు చదును చేసుకునేందుకు, పనులను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాది హామీ టెక్నీకల్ అసిస్టెంట్ మహేష్,ఉప సర్పంచ్ పోసాని, వార్డ్ సభ్యులు గ్రామస్తులు కూలీలు తదితరులు ఉన్నారు.
- Advertisement -



