Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారిని కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను అరెస్ట్ చేయాలి

చిన్నారిని కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను అరెస్ట్ చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – చండూరు : నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత, రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి, తీవ్రంగా కొట్టి హింసించి, రెండు నెలల పసికూనను కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారీ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రజక సంఘం డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ పట్టణలో చండూరు రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు పగిళ్ల బిక్షం, బూతారాజు దేవయ్య మాట్లాడుతూ.. కుమ్మరెలో జరిగిన మల్లన్న జాతరలో దైవదర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనిక దంపతులను ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి ఇతరులు అడ్డుకొని ఘర్షణకు దిగి గణేష్ పై దాడి చేసి దండం పెట్టినా వినకుండా రెండు నెలల చిన్న పాపను కాళ్లతో తన్ని శిశువుని హత్య చేసిన దుండగులపై నేటికీ హత్యానేరం కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో  భూతరాజు రాజు, వెంకన్న, సంగెపు మల్లేష్, నాంపల్లి శేఖర్, ఐత రాజు మల్లేష్, భూతరాజు సూర్యం, భూతరాజు శ్రీహరి, పాండు, రాజశేఖర్, వేణు, నరేష్, నాగిని బిక్షం, భూతరాజు అంజయ్య, వెంకన్న,పగిల రాజు, సాయి, శంకర్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -