Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్లు మానవత్వంతో పని చేయాలి :మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

డాక్టర్లు మానవత్వంతో పని చేయాలి :మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 
డాక్టర్లు తెల్ల కోటుకు పరిమితం కాకుండా, మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సేవలందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ  ప్రభుత్వ వైద్య కళాశాలలో “అద్వితీ -2026” పేరున నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వృత్తుల కన్నా  వైద్య వృత్తి పవిత్రమైనదని అన్నారు. నల్లగొండ  ప్రభుత్వ వైద్య కళాశాల అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిందని, వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు సబ్జెక్టులతో పాటు, మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని, తెల్ల కోటు బాధ్యతకు “సింబల్ ”అని అన్నారు.

కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని , వైద్య కళాశాల విద్యార్థుల కోసం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలలోపు వీటిని మంజూరు చేస్తామన్నారు. ఇటీవలే ఏఐజి ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకురావడం జరిగిందని, నల్లగొండ  ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన పిజి విద్యార్థులను పరిశోధన నిమిత్తం తన ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం 45 మంది చొప్పున తీసుకునేందుకు అంగీకరించారని, ఇందుకు సంబంధించిన ఎం ఓ యు ను త్వరలోనే కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

నల్లగొండ  పట్టణంలో వైద్య విద్యనే కాకుండా, చదువుకోసం ప్రతి పేద విద్యార్థికి సహకారం అందిస్తామని, ఇందుకు తమను సంప్రదించాలని, విద్యాభివృద్ధిలో భాగంగా బోట్టు గూడా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను, అలాగే ప్రతిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని , పట్టణంలోని మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని, 900 కోట్ల రూపాయలతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా చేస్తామని తెలిపారు.

నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందించాలని కోరారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ వత్తి పవిత్రమైందని, రోగులను చిరునవ్వుతో పలకరించి వారికి వైద్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అమీర్ ఆశ్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్  సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, డాక్టర్లు ఆయా వైద్య విభాగాల అధిపతులు, తదితరులు  హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేయర్లు వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -