- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గాంధీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, హోంగార్డు ఇద్దరు బాధితుని వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం డాక్టర్ సందీప్ కీసర హోంగార్డు బాధితుని వద్ద రూ.2 లక్షల లంచం అడిగారు. కాగా లక్ష రూపాయలకు బేరం కుదురింది. ఇవాళ కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బాధితుడి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
- Advertisement -



