- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి జనరల్ అజీజ్ నసీర్జాదే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అబ్దోల్ రహీమ్ మౌసావి మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ ఆదివారం వెల్లడించింది. ఇరాన్ రక్షణ మండలి సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో వీరు మరణించారు. నసీర్జాదే మృతిని అధికారికంగా ధ్రువీకరించారు. సాయుధ దళాలకు చెందిన పలువురు కమాండర్లు కూడా మరణించారని, వారి పేర్లను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.
- Advertisement -



