- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పలు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు రోడ్లలన్ని జలమయమైయ్యాయి. దీంతో ఎక్కడ ఏ మృత్యు గుంత ఉందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. గురువారం ముంబైలో రోడ్డుపై తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ జునాగడ్ లో కూడా ఈ తరహా సంఘటన చోటుచేసుకుంది. కాకాపోతే త్రీవ గాయాలతో మృత్యు నుంచి తప్పించుకున్నాడు. అందుకు ఓ సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్షం నీటితో నిండిన రోడ్డుపై మోటార్సైకిల్పై వెళ్తున్న ఒక జంట, పెద్ద గుంత కారణంగా అకస్మాత్తుగా తీవ్ర ప్రమాదానికి గురైన దృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.
- Advertisement -



