- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ (హెచ్పిఆర్సి) ఆధ్వర్యంలో నేటి నుంచి ఈక్వెస్ర్టియన్ చాలెంజ్ పోటీలు ఆరంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరుగనున్న టోర్నమెంట్లో అన్ని వయో విభాగాల్లో హ్యాక్స్, డ్రెస్సేజ్, షో జంపింగ్ పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెపిఆర్సి ప్రెసిడెంట్ చైతన్య కుమార్, తెలంగాణ ఈక్వెస్ర్టియన్ సంఘం కార్యదర్శి రఘు, టోర్నమెంట్ సెక్రటరీ వినీత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



