- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ అలీసా హీలీ (158: 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్స్లు) తన చివరి వన్డేలో దంచికొట్టింది. మరో బ్యాటర్ బెత్ మూనీ (106*: 84 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్) శతకంతో చెలరేగింది. జార్జియా వోల్ (62), కేరీ (34*) రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, స్నేహ్ రాణా 2, రేణుకా సింగ్, కాశ్వీ గౌతమ్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు నెగ్గిన ఆసీస్ ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే.
- Advertisement -



