నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక విద్య కమిషన్ సిఫారసులను సవరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు విద్యా కమిషన్ను డిమాండ్ చేశారు. ఆదివారం జన్నారంలో పత్రికా విలేకరులతో మాట్లాడారు.. విద్యా కమిషన్ సిఫారసులు ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ముఖ్యంగా జీతా బత్యాల గురించి ప్రస్తావించడం చాలా దారుణమైన విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 20 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి తన యొక్క చివరాకరి నేల జీతం రూ. 1లక్ష యాభై వేలు ఉండటంలో తప్పేంటి అని ఆయన కమిషన్ ను ప్రశ్నించారు.
ప్రభుత్వం కమిషన్ ఉపాధ్యాయ ఉద్యోగుల వేతనాలనే చూస్తుంది,కానీ వారు అంకితభావంతో ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం యొక్క అభివృద్ధిలో భాగమనే విషయాన్ని మర్చిపోతున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యాశాఖలోని ఉపాధ్యాయులు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా వేతన జీవులుగానే రిటైర్డ్ అయ్యే వరకు ఉంటున్నారని రిటైర్డ్ అయిన తర్వాత కుటుంబ బాధ్యతలు వారి యొక్క 30 సంవత్సరాల ఆస్తి చూసుకుంటే ఎంతుంటుందో ఒకసారి ఆలోచించాలని ఈ విధంగా ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సిఫార్సులు చేయడం సరికాదని వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఇప్పుడిప్పుడే ఉద్యోగస్తుల యొక్క వేతనాలు పెరుగుతున్నాయి.
గత 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు వారి యొక్క వేతనాలు ఏ విధంగా ఉండే పెరిగిన ధరల కానుగుణంగా ఒక ఉద్యోగి రిటైర్డ్ అయ్యే నాటికి వారి కుటుంబ పోషణ వారి యొక్క పిల్లల చదువులకయ్యే ఖర్చు ఈ రోజులలో లక్షలలో ఉంటుంది ఏదేమైనా విద్యాభివృద్ధికి పాఠశాలల అభివృద్ధికి మౌ ళిక వశతుల కల్పనకు ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు విద్యార్థులకు పూర్తిస్థాయి మౌలిక వసతులు పూర్తి స్థాయి కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులు కల్పించేలా పాఠశాల అభివృద్ధి గురించి సిఫార్సులు చేయాలన్నారు.. కానీ ఉపాధ్యాయుల వ్యక్తిగతగా వారిని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉండరాదన్నారు.
వెంటనే ఉపాధ్యాయుల బకాయిలను చెల్లించాలని పిఆర్సిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, రాష్ట్ర నాయకులు బాదావత్ ప్రకాష్ నాయక్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.



