ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వ నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు చెప్పారు. మండలంలోని వాడియాల గ్రామ శివారులోని దుందిబి వాగు నుండి ఇసుకను అనుమతి లేకుండా ఇతర గ్రామాలకు ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన యువ రైతులు ట్రాక్టర్ వెంబడిపడి పట్టుకొని వాడియాల గ్రామా రచ్చ కట దగ్గర తీసుకొచ్చి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులు పట్టుకున్న డాక్టర్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు చెప్పారు. ప్రభుత్వ నుండి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



