- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, అజాత శత్రువు,స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకల్లో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజు ఆధ్వర్యంలో సోమవారం శ్రీపాదరావు జయంతి వేడుకలు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



