- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఉదయం జనగణన ప్రక్రియపై అవగాహన, మధ్యాహ్నం అభివృద్ధి పనులు, భూసేకరణ, అటవీ అనుమతులపై చర్చించనున్నారు. పరిపాలనను బలోపేతం చేస్తూ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో కలెక్టర్ల పాత్రపై సీఎం స్పష్టమైన కార్యాచరణను వివరించనున్నారు. కాగా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్నారు.
- Advertisement -



