- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించడానికి ఎంపికైనట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమాచారం ఆమె మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ నుండి ఉత్తర్వులు రావడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు అందరూ నాలుగు సంవత్సరాల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
- Advertisement -



