Wednesday, March 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొమ్మాలలో ప్రభల జోరు

కొమ్మాలలో ప్రభల జోరు

- Advertisement -

– కొమ్మాల నరసింహుని జాతర షురూ..
– లక్ష్మీనర్సింహస్వామికి మొక్కులు సమర్పిస్తున్న భక్తులు..
– కొమ్మాల స్టేజీ ప్రభలతో దద్దరిల్లింది…
– భక్తులకు కనువిందు చేసిన బారి ప్రభలు …
– ప్రత్యేక ఆకర్షణగా కొండా వర్గీయుల ప్రభ..
నవతెలంగాణ-గీసుకొండ : మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర హోలీ పండుగతో మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 :30గంటల వరకు చంద్రగ్రహణం కారణంగా గుడిని మూసివేశారు.అనంతరం దేవాలయాని సుద్ది చేసి ద్వారాలు తెరిచారు.భక్తులు పెద్ద సంఖ్యల్లో వచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. రాజకీయ పార్టీల ప్రభబండ్లు ,కార్యకర్తల హడావిడితో కొమ్మాల స్టేజి దద్దరిల్లింది.ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు తమ మార్కును చూపించి ప్రభల శోభ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేశారు. డీజేల నిషేధం చేయబడింది.అయినా ప్రభల ముందు డీజెల మోతలు మోగాయి . కాంగ్రెస్ ప్రభను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ప్రభల శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు.ప్రతి భక్తున్ని మన అతిథిగా భావించాలి…
రాష్ట్రంలోని నలుమూల నుండి వస్తున్న భక్తుల ఆసౌకర్యం కలుగ కుండా చూసుకోవాలి. నరసింహుడి ప్రీతి పదమైన కార్యక్రమం అని అన్నరు.బీఆర్ఎస్ ప్రభను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీన ర్సింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖఃసం తోషాలతో ఉండాలన్నారు. కొండా వర్గం ప్రభను అల్లం బాల కిషోర్ రెడ్డి ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు .

కొండా మురళీ మాట్లాడారతు …కొమ్మాల జాతర అంటేనే కొండా మురళీ జాతర అని అన్నారు. నా రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుండే మొదలయింది. నాకు పునర్జన్మ ఇచ్చింది లక్ష్మీనరసింహస్వామి మరియు గీసుకొండ ప్రజలు గీసుకొండ నుండి కొండా మురళీ పేరు పెట్టుకొని ధైర్యంగా ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.కొండా సుష్మిత పటేల్ ను ఎమ్మెల్యేను చేసి తీరుతా అని అన్నారు.
కొండా సుష్మిత మాట్లాడుతూ…. గీసుకొండ నుండి మా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం మొదలు అయింది అని ….నా ప్రస్థానం కూడా గీసుకొండ నుండే మొదలు అవుతుందన్నారు.కొండా మురళీ అంటే రాజకీయ నాయకులకు ఆడలని అన్నారు. గీసుకొండ మండల ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నారు… ఇక్కడికి వస్తే మా సొంత పుట్టింటికి వచ్చిన అనుభవం నాకు ఉంది పరకాల ప్రజలు బాధలో ఉన్నారు. ఇకనుంచి వారానికి రెండు సార్లు వంచనగిరిలో ఉంటా మీ అందరికీ ధైర్యాన్ని అవుతా. మా అమ్మ నాన్నలకు రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుండి మొదలైంది నా రాజకీయం కూడా ఇక్కడినుండే మొదలు పెడతా అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు అభిమానుల కోలాహాలంతో. ప్రభ బండి ముందుకు సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పిల్లా ,పాపలతో ఎడ్లబండ్లపై కొమ్మాల జాతరకు వచ్చి తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -