నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ లో బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బైకాన్ జమున మహేష్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి నరేందర్ ప్రభుత్వ విడుదల చేసిన నిధులకు సంబంధించిన జమ, ఖర్చు వివరాలను చదివి వినిపించారు.గ్రామ సభలో 2026-27 సంవత్సరానికి సంబంధించి చేయాల్సిన పనుల వివరాలను, వాటికి ఖర్చు చేయాల్సిన నిధుల గురించి చర్చించారు.
సర్పంచ్ బైకాన్ జమున మహేష్ మాట్లాడుతూ గ్రామస్తులు సకాలంలో ఇంటి పన్నుల చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజల ఇంటి పనులు చెల్లిస్తూనే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల రెవెన్యూ అధికారి శరత్, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



