- Advertisement -
నవతెలంగాణ – తొగుట
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలని సర్పంచ్ కోలా వెంకట స్వామి గౌడ్ అన్నారు. శుక్ర వారం మండలంలోని బండారు పల్లి గ్రామంలో డ్రై డె, ఫ్రైడే లో భాగంగా గ్రామంలో ఇండ్లలో నిలువ ఉన్న నీటిని పార్సిలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో పాత టైర్, కొబ్బరి చిప్పలలో వర్షం నీరు నిలిచి ఉంటే అందు లో డెంగ్యూ, మలేరియా దోమలు నివాసం ఏర్పా టు చేసుకుంటాయని అన్నారు. వర్షాలు కూరుస్తు న్న సందర్బంగా వేసవి కాలంలో కులర్లు ఉన్న నీటి ని తీసివేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్, అంగన్వాడీ టీచర్ రాణమ్మ, ఆశా కార్యకర్త కవిత, వివో భవిత, వార్డు సభ్యులు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


