- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన కల్తీ కల్తీ. మరి ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో ప్రతి దాంట్లో కల్తీ. తాజాగా హైదరాబాద్లో మరో నకిలీ ముఠా గుట్టురట్టయ్యింది. లాలాగూడలోని ఝాన్సీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ గోడౌన్పై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రసాయనాలతో కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ‘ఝాన్సీ-M’ నకిలీ బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు బయటపడింది. దాడుల్లో 1,915 కేజీల కల్తీ పేస్ట్తో పాటు ఎసిటిక్ యాసిడ్, క్సాంతమ్ గమ్, ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గోడౌన్ యజమాని వెంకటేశ్వర్లు సహా పలువురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -



