నవతెలంగాణ-మద్నూర్
అప్పుడెప్పుడో నిజాం పాలనలో కట్టించిన మద్నూర్ తహశీల్దార్ భవనం శిథిలావస్థకు చేరుకున్న విషయం పాఠకులకు విదితమే. ఇప్పటివరకు మరమ్మత్తులకు కూడా నోచుకోని కార్యాలయానికి ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నూతన భవన నిర్మాణానికి ముందడుగు పడింది. ఇందులో భాగంగా శుక్రవారం ఈ కార్యాలయ నిర్మాణానికి రూ. 2.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం తహశీల్దార్ ఎండీ ముజీబ్ స్థల పరిశీలన చేసి, సర్వే చేయించారు. అనంతరం ఈ భూ సర్వే నివేదకలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. మద్నూర్ తహశీల్దార్ నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నూతన తహశీల్దార్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



