నవతెలంగాణ – మిరుదొడ్డి
భూంపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లాస్థాయి పర్యవేక్షణ బృందం పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సందర్శించారు. ఇందులో భాగంగా ఉదయం ప్రార్థన సమయానికి పర్యవేక్షణ బృందం వచ్చి ప్రార్థనలో జరిగే అంశాలు, తరగతి గది పరిశీలన, విద్యార్థులలో తెలుగు ఆంగ్లం మరియు గణిత సామర్ధ్యాల పరిశీలన, పూర్వ ప్రాథమిక తరగతి పరిశీలన, వర్క్ బుక్ , నోటుబుక్కుల పరిశీలన , మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు, బోధన అభ్యసన సామాగ్రి, బోధన అభ్యసన ప్రక్రియ, టీచర్ హ్యాండ్ బుక్ ,టెక్స్ట్ బుక్, వర్క్ షీట్ల అలైన్మెంట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రిజిస్టర్ ల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి అక్కడ జరిగే కార్యక్రమాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలు ఉండడం వల్ల ఉపాధ్యాయులను విద్యార్థులను పర్యవేక్ష బృందం అభినందించారు. పాఠశాల నిర్వహణకు సహకరిస్తున్న వారిని దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇకముందు కూడా మరింత మెరుగ్గా కార్యక్రమాలు కొనసాగించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ బృందం నోడల్ అధికారి శ్రీ కోల పద్మా రెడ్డి, నాగేందర్, లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కిషన్ ఉపాధ్యాయులు రాజేశ్వరి, ఇందిరా, బాలకృష్ణ, విద్యా వాలంటీర్లు సరిత,, నవితలు, పాల్గొన్నారు.



