Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హద్దు దాటి ఆర్ఎంపీల వైద్యం

హద్దు దాటి ఆర్ఎంపీల వైద్యం

- Advertisement -

అర్హత లేని శంకర్ దాదాలపై అధికారుల వెనుకడుగు.. 
మర్మమేమిటి సారు 
నవతెలంగాణ – నవాబు పేట
హద్దు దాటి ఆర్ఎంపీ లు చేసే వైద్యం మండల కేంద్రముతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆర్ఎంపీ ల దందా జోరుగా సాగుతోంది. గతంలో ఆర్ఎంపీ ల వైద్యం వికటించి చనిపోయిన లేదా వారు వాడే స్టెరాయిడ్స్ ఇతర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వార్తలు రాయకుండా కొందరు రాజకీయ నాయకులతో మంతనాలు జరిపి గుట్టు చప్పుడు కాకుండా లోపాయికారీ ఒప్పందాలు కుదిరాయి. ఇటీవల కొందరు ఆర్ఎంపీ లు ఏడాదికి కొంత నగదు ఇస్తామంటూ నవాబ్ పేట మండలంలోని కొందరు ఆర్ఎంపీ లు శంకర్ దాదాలుగా చలామని అవుతున్న ఆర్ఎంపీల సంఘంగా ఏర్పడి అందరూ సమావేశమై మండలంలోని కొంతమంది డబ్బులు ముట్ట చెప్పినట్లు తెలిసింది.

అయితే తాము ప్రధాన పత్రికలకు తామే పెద్ద, మిగతా ఆన్లైన్ పత్రికలు చలమనులు ఉండవని అవి కేవలం ఫోన్ లో మాత్రమే కనిపిస్తాయని చెబుతూ అ సంఘానికి నేనే పెద్దమనిషిని అని తాను చెప్పినట్టే చెప్పినవారికే డబ్బులు, యాడ్స్, పత్రికలు ఇవ్వాలని ఆయన హుకుం జారీ చేయడంతో ఆర్ఎంపీలు కొంతమందిని మచ్చిక చేసుకుని భారీగా నగదు, విందు వినోదాలు ఇచ్చి జల్సాలు చేస్తున్నట్లు సమాచారం.

ఒక్కో డాక్టర్ ది ఒక్కో తీరు..
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆర్.ఎం.పి డాక్టర్ లు ఎంబిబిఎస్ తరహాలో ప్రత్యేక గది, అనుబంధంగా మెడికల్ షాప్, చిన్నపాటి ఆపరేషన్లు, స్టెరాయిడ్స్, డోస్ పెంచి ఇంజక్షన్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఎవరైనా వారిని నిలదీస్తే గ్రామ పెద్దలతో రాజకీయ నాయకులతో ఫోన్ లు చేయించి మా డాక్టర్ మీదే వార్తలు రాస్తావా అంటూ వార్తలు రాసిన సదరు విలేకరి పై దాడులకు పురమాయిస్తారు. అలాగే మరో కొందరు డాక్టర్ల తీరే వేరని చెప్పవచ్చు. చిన్న జ్వరం వస్తే టెస్టుల పేరుతో కార్పొరేట్ హాస్పిటల్ లకు రిఫర్ చేసి డబ్బులు దండుకుంటున్నట్లు తెలిసింది.

అలాగే మండల కేంద్రంమైన నవాబుపేటలో మరో డాక్టర్ ఎంబీబీఎస్ తరహాలో ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్లకు వందలు, వేలల్లో డబ్బులు గుంజుతున్నట్లు సమాచారం. టెస్టుల పేరుతో కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.2000 నుండి రూ.3000 రూ గుంజుతున్నట్లు బాధితులు తెలిపారు. వారు చేసే తప్పులు బయటకు రాకుండా ఇద్దరు పెద్ద డాక్టర్లు, ఓ సంఘము నేత కలిసి అందరు ఆర్ఎంపీ లతో మాట్లాడి ఈ వ్యవహారం నడిపినట్టు తెలిసింది.

అధికారులు ఎక్కడ.?
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నవాబుపేట మండలంలో ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కనీసం ఆర్ఎంపీల కేంద్రాలను తనిఖీ చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పు చేయని శంకర్ దాదాలు కొందరికి ముడుపులు ఎందుకు ఇచ్చినట్లో ప్రజలకు సమాధానం చెప్పాలి. అధికారులు ఇప్పుడైనా స్పందించి చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -