- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామస్థులు డొంకేన కేతమ్మ, డొంకేన నరేష్ గౌడ్, దొంకేన సురేష్ గౌడ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి సమాచారం మేరకు ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మృతులకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా తన వంతుగా వారికి తక్షణ సహాయకరంగా రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం అని, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.
- Advertisement -



