- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని కటక్కు చెందిన అనిల్ దాస్గా గుర్తించారు. పోలీసులు, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -



