- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
నిజామాబాద్ – కామారెడ్డి జిల్లాల తెలంగాణ గిరిజన సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్గా ఇటీవల రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రవీందర్ అంతకుముందు హనుమకొండ జిల్లా తెలంగాణ గిరిజన సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్గా పనిచేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -



