Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ కు మంత్రి పదవి దక్కక పోవడం అన్యాయమే..

జుక్కల్ కు మంత్రి పదవి దక్కక పోవడం అన్యాయమే..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
ఇప్పటివరకు జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కక అన్యాయమే జరిగింది. ఇప్పుడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఒక విద్యావంతునిగా జుక్కల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ తోటా లక్ష్మి కాంతారావుకు మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలని మద్నూర్ మండలం మీర్జాపూర్ హనుమాన్ మందిర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ శుక్రవారం నాడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయనతో పాటు మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వట్నాల వార్ రమేష్ విజ్ఞప్తి చేశారు. పూర్తిగా వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గనీకి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కక ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఇపుడైనా కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గం మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img