Saturday, March 14, 2026
E-PAPER
Homeఆటలుహాకీ ప్రపంచకప్.. ఫైనల్లో భారత మహిళల జట్టు

హాకీ ప్రపంచకప్.. ఫైనల్లో భారత మహిళల జట్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీపై 1-0 తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్, ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. తొలి క్వార్టర్‌లో రెండు జట్లు గోల్స్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రెండో క్వార్టర్‌లో భారత్ ఒకింత ఆధిపత్యం ప్రదర్శించి పలు పెనాల్టీ కార్నర్‌లు సంపాదించింది. అయితే, ఇటలీ గోల్‌కీపర్ లూసియా ఇనెస్ వాటిని సమర్థంగా అడ్డుకుంది. మ్యాచ్‌లో ప్రతిష్ఠంభన వీడటానికి చాలా సమయం పట్టింది.

ఆట 40వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మనీషా చౌహాన్ అద్భుతంగా గోల్‌గా మలిచింది. ఆమె కొట్టిన పవర్‌ఫుల్ డ్రాగ్‌ఫ్లిక్ ఇటలీ డిఫెన్స్‌ను ఛేదించుకుని నేరుగా నెట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఏకైక గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో స్కోరు సమం చేసేందుకు ఇటలీ తీవ్రంగా ప్రయత్నించింది. 59వ నిమిషంలో వారికి పెనాల్టీ కార్నర్ లభించినా, భారత రక్షణ గోడను వారు ఛేదించలేకపోయారు. దీంతో భారత్ విజయం ఖాయమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -