నవతెలంగాణ-హైదరాబాద్: షిండే వర్గంలో ఆరుగురు లోక్సభ ఎంపీల విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టును ఉద్ధవ్ వర్గం ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ను ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసింది. ఉద్ధవ్ వర్గం పిటిషన్ను విచారించేందుకు సమ్మతిని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది.ఈ విలీనాన్ని ఆమోదిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉద్ధవ్ వర్గం విజ్ఞప్తి చేసింది.
లోక్సభ వర్షాకాల సమావేశాలకు ముందే ఎంపీల విలీనానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఎంపీల విలీనంతో లోక్సభలో 13 మందికి షిండే వర్గం శివసేన బలం పెరిగింది. కేవలం మూడు స్థానాలకు ఉద్ధవ్ థాకరే (UBT) పార్టీ ఎంపీల సంఖ్య పడిపోయింది. ఎవరికి వ్యతిరేకంగా గెలిచారో వారితోనే విలీనమవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో ఉద్ధవ్ వర్గం వాదనలు వినిపించింది.



