Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం..బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ కూలి ముగ్గురు మృతి

విషాదం..బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ కూలి ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదలో మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు(48), బండారి అభిలాష్(16)తో పాటు.. పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య (53) స్పాట్ లోనే మృతి చెందారు. సుకినే మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -