రైతు నగర్ లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం
జిల్లా సీఈఓ చందర్ నాయక్
నవతెలంగాణ- నసురుల్లాబాద్
పేద ప్రజలు ఆత్మగౌరవంతో నివసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ సీఈవో చందర్ నాయక్ అన్నారు. శనివారం రైతునగర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతింట్లో నివసించాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆర్థిక ఇబ్బందులతో ఇది నెరవేరని వారెంతో మంది ఉన్నారని, వారికి హస్త ప్రభుత్వం ఇంద్రమా పథకంతో సొంతిల్లు నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. అర్హులైన పేదలకు విడతల వారీగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. అనంతరం పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వలను పరిశీలించారు. జడ్పీ సీఈవో వెంట నసురుల్లాబాద్ ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్, ఇన్ఛార్జి ఎంపీడీవో మహిబూబ్, సూపరింటెండెంట్ భానుప్రకాష్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ సమీనా, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు ప్రవీణ్ గంగారం తదితరులు ఉన్నారు.
నెరవేరిన సొంత ఇంటి కల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



