- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
పాల కడలిని చిలికితే వచ్చే అమృతంలా.. అక్షర కడలిని చిలికితే లభించే జ్ఞానామృతం వంటిదే ప్రభుత్వ బడి అని కాంప్లెక్స్ హెచ్ఎం బండి నర్సవ్వ అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ లలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కు కాంప్లెక్స్ హెచ్ఎం నర్సవ్వ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ హెచ్ఎం నిమ్మ రమేష్, ఉపాధ్యాయ బృందం ఆర్ కరుణాకర్, సీహెచ్.మధు, ఆర్.రుచిత, సీఆర్పీ ఆర్.స్వామి పలువురు పాల్గొన్నారు.
- Advertisement -