నవతెలంగాణ – నసురుల్లాబాద్
మండల కేంద్రంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం నసురుల్లాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ రంజన్ తోఫా కిట్ లను నాయబ్ తహసీల్దార్ భావయ్య, ఆర్ ఐ స్వామి లు మండల పరిధి ముస్లిం సోదరులకు అదే చేశారు. ఒక్కో ప్యాకెట్లో చీర, బ్లౌజ్, పంజాబీ డ్రెస్, లాల్చీ, పై జామా ఉన్నాయి. తహసీల్దార్ల ఆధ్వర్యంలో మండలంలో మసీదు కమిటీల నేతల ద్వారా పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా నాయబ్ తహసీల్దార్ భావయ్య మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులు, సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం, సమృద్ధి తీసుకురావాలని, అల్లాహ్ ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు సహాయం చేయడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధి ముస్లిం నేతలు తదితరులు పాల్గొన్నారు.



