- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: పట్టణంలోని 9వ వార్డులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం తడి చెత్త,పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు.మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్,కమిషనర్ కీర్తి నాగరాజు,కౌన్సిలర్ బత్తిని మహేశ్వరి పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా సీసీ రోడ్ల పనులను పరిశీలించి,డ్రైనేజీ పూడికతీత,పిచ్చి మొక్కల తొలగింపు పనులను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, శేఖర్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



