Monday, June 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూ బాధితులకు పరిహారం చెల్లించాలి

భూ బాధితులకు పరిహారం చెల్లించాలి

- Advertisement -

సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌
వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన
నవతెలంగాణ-తాండూరు

వికారాబాద్‌ జిల్లా తాండూరు బైపాస్‌ రింగ్‌ రోడ్డు భూ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ(ఎం), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్‌.మహిపాల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం తాండూర్‌లో బైపాస్‌ రింగ్‌ రోడ్‌ కోసం కోకాట్‌, అంతారం, చెంగోల్‌, మిగతా గ్రామాల్లో నివసించే పేద ప్రజల నుంచి స్థలాలు సేకరించిందని తెలిపారు. నోటీసులు కూడా ఇవ్వకుండా భూములు లాక్కున్నారని తెలిపారు. కనీసం వీరికి నష్టపరిహారం కూడా చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ బాధితులు తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి ప్లాట్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు యు.బుగ్గప్ప, ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బస్సు చంద్రయ్య, ఎస్సీ, ఎస్సీ మైనారిటీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ఎంహెచ్‌పీఎస్‌ తాండూర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ సమియుద్దీన్‌, బాధితులు ఎస్‌.శ్రీనివాస్‌, సీవీ రమేష్‌, శ్రీనివాస్‌, బాల్‌రెడ్డి, కే.సమర్‌, శివ, విష్ణు, శేఖర్‌, వెంకటమ్మ, రాజు, నర్సింలు, వెంకటేష్‌, అశోక్‌, అనంతమ్మ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -