- Advertisement -
ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో నేషనల్ గ్రీన్ కోర్స్
నవతెలంగాణ-మల్హర్ రావు
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే వాడాలని మండలంలోని మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు తెలిపారు. బుధ,గురువారం పాఠశాలలో జాతీయ హరిత దళం అనుబంధంగా మట్టితో విగ్రహ నిర్మాణ వర్క్షాప్ నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్స్ పాల్ మాట్లాడారు పర్యావరణ హిత విగ్రహాలు ఎలా తయారు చేయాలో,పర్యావరణ కాలుష్యం ఎలా తగ్గించుకోవచ్చో తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



