- Advertisement -
నవతెలంగాణ-పుల్కల్
పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు నుంచి మంగళవారం త్రాగునీటి అవసరాల నిమిత్తం మంజీరా డ్యామ్ కు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. మంజీరా ప్రాజెక్టులోకి త్రాగునీటి అవసరానికై ఈ నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ సంగారెడ్డి ప్రాంతాల్లో తగునీరు సమస్య రాకుండా ఈ నీటిని వదులుతున్నామన్నారు. ప్రాజెక్టులో నుంచి 0.1 టీఎంసీ నీటిని 10 నంబర్ గేటు ద్వారా వదులుతున్నామన్నారు. మంజీరా నది పరివాక ప్రాంతంలోని ప్రజలు పశువుల కాపరులు జాలర్లు అప్రమంతగా ఉండాలని అధికారులు సూచించారు.
- Advertisement -



