- Advertisement -
నవతెలంగాణ-నిజామాబాద్
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కాలనీ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవం సందర్భంగా ఎస్. అర్చన ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు గురువుల పట్ల గౌరవం, క్రమశిక్షణ, సంస్కారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థికి జీవితంలో తల్లిదండ్రులే తొలి గురువులని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తల్లిదండ్రులు–గురువుల ఆశీస్సులతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోగలరని వారు మార్గదర్శనం చేశారు. విద్యార్థుల్లో మంచి విలువలను పెంపొందించే విధంగా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



