– ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి తరలుతున్న రైతులు
– వెల్లడించిన ఆయిల్ ఫెడ్ డీఓ శంకర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
సిద్దిపేట జిల్లా, నర్మెట్ట లో ప్రారంభంలో ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో 300 కోట్ల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ప్రాసెస్సింగ్ పరిశ్రమ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవాలు కు ఉమ్మడి ఖమ్మం భారీ సంఖ్యలో రైతులు లను తరలిస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి శబావత్ శంకర్ శనివారం విలేకరుల కు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా నుండి నాలుగు బస్ ల్లో 400 మంది, కొత్తగూడెం జిల్లా నుండి 3 బస్ ల్లో 150 మంది రైతులు బయలు దేరుతున్నారని,ఇదే క్రమంలో ఈ ప్రాంతం లో పామాయిల్ సాగు చేస్తూ లబ్ధిపొందుతున్న అనేక మంది రైతులు అధిక సంఖ్యలో స్వచ్చందంగా వారి వారి స్వంత వాహనాలలో తరలుతున్నారు అని తెలిపారు.
అయితే ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి పలు జిల్లాల నుండి అనేకమంది ఔత్సాహిక రైతులు అశ్వారావుపేట ప్రాంతానికి వచ్చి ఇక్కడ సాగు అవుతున్న పామాయిల్ పంటను, అప్పారావు పేట మీ, అశ్వారావుపేట లోని పరిశ్రమలను సందర్శించే వారు. నేడు ఈ ప్రాంతం నుండి అక్కడికి తరలడం ఆయిల్ ఫెడ్ సంస్థ కు శుభపరిణామం గా అధికారులు,రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



